Thursday, April 23, 2015

శఙ్కరజయన్తి

శ్రీ గురుభ్యోనమః

          సృష్టిలో 84 లక్షల జంతుకోటి ఉన్నదని చెప్పబడింది. ఈ సమస్త జీవకోటి నిరంతరమూ ప్రయత్నించేది దేనికి అని ప్రశ్న వస్తే దాని సమాధానం ’సుఖముగా ఉండడం కొరకు మాత్రమే’ అన్నది నిర్వివాద సమాధానం. ఎంత కష్టపడ్డాఏ పని చేసినా చేయకున్నా ప్రతి జీవి ప్రయత్నించి కోరుకునేది సుఖమే. ఏ ప్రాణీ కూడా నాకు సుఖమక్కరలేదు అని చెప్పదు కదా... పైగా ఎంత ఎక్కువ సుఖం పొందాలా అని తాపత్రయపడుతూ ఉంటుంది. అన్ని వృత్తులు సుఖము కొరకే అని కదా ఆర్యోక్తి.

          పరిశీలనమువివేచనవివేకముబుద్ధి అను వివిధ వివిధములుగా వ్యావహారికంలో తెలియబడుతున్న విలక్షణమొకటి మనిషిని మొత్తం 84 లక్షల జంతుకోటి నుండి వేరు చేస్తున్నది. బుద్ధి వికసనము చేత పరిశీలనము చేత మాత్రమే మనిషి మిగిలిన జీవరాశినుండి వేరుపడి విశిష్టమైన జంతువు/జీవిగా తెలియబడుతున్నాడు. మనిషి ఈ అన్ని సుఖములు అనుభవించినమాత్రకన్నా ఎక్కువ అనుభవించుటచేత దుఃఖములే అవుతున్నాయని యెఱిగి అసలు సుఖమును గూర్చిన విచారణ చేయగలిగినవాడు మనిషి ఒక్కడే. అది ఏ సుఖముదాని సాధన విశేషాలేమిటి వగైరా వగైరా పరిశీలనము చేయాలి. ఆ వివేకమే మనిషిగా పుట్టిన వాడు చెయ్యవలసినది ముఖ్యమైనదీనూ... అలా పరిశీలనమువివేకము లేని మానవ జన్మకు విశిష్టత కుదరదుతక్కిన జంతుకోటితో ఆమనిషిని కూడా కలిపి చెప్పవలసి ఉంటుంది.
          ఈ పరిశీలనలో కలిగే ముందు అనుమానాలాలో నేనెలా వచ్చాను ఎందుకు వచ్చానుఈ కనపడుతున్నదంతా ఎలా వచ్చింది సృష్టి ఆది ఏది ఇలా సాగుతుంది... వీనికి సమాధానం కేవల మానవ మేధస్సుకు సాధ్యం కాదు కారణం దేనినీ మానవుడు సాధించలేదు అంటే నిర్మించలేదు. దీనిని సాధించుటకు అసలు సృష్టి ఎవరు చేసారు వారి సహాయం కోరుతుంది మన బుద్ధి. ఆయనను పరబ్రహ్మంగా తెలిసి దానినుండి వ్యక్తమైన వేదవేదాంతవేదాంగాదులను సహాయముగా తీసుకుని విచారణ మొదలుపెడుతుంది. అవి అందరికీ అందనివి అవ్వడం వలన కారుణ్య మూర్తులైన ఋషులు తేలికగా తంత్ర,పురాణేతిహాసాల రూపంలో అందించగా మరింత తేలిక చేసినవారు వ్యాసులు. వేద వేదాంతాలను బ్రహ్మ సూత్రాలుగా వేదాంత సారాన్ని భగవద్గీతగాపురాణాలుగా ఎంతో అపారమైన వాఙ్మయాన్ని అందించారు. 
          కానీకలిలో మానవులు అలసులుమందబుద్దులుఅల్పాయుష్కులుఅవైదిక మార్గ తత్పరులు అవ్వడం చేత సాక్షాత్ దక్షిణామూర్తియే కలియుగంలో మరో గురుమూర్తిగా "జగద్గురు శ్రీ శ్రీ శ్రీ ఆది శంకర భగవత్పాదులు"గా అవతరించి సామాన్య మానవ మేధస్సులకందని నిగూఢమైన వేదఔపనిషద్తంత్రమంత్రపురాణ స్తోత్రాదులను సులభరీతులలో ప్రకరణ గ్రంథాలుగాస్తోత్రాలుగాఇచ్చి ప్రస్థాన త్రయ భాష్యమిచ్చి నిగూఢమైన శాస్త్రార్థములను సామాన్య మానవుని దగ్గరకు చేర్చారు. అవైదిక మత ప్రాచుర్యాన్ని ఖండించి సంస్కరించి షాణ్మత స్థాపన చేసారు పంచాయతన పూజ నెలకొల్పారు. భారతావని చుట్టూ నాలుగు ఆమ్నాయ (ఆమ్నాయము=వేదము) మఠాలు పెట్టారు. కంచిలో సర్వజ్ఞపీఠాన్ని అధిరోహించారు. ఇవేకాక కాశీలో ఉన్న గురుపీఠము (ప్రస్తుతం శృంగేరి వారి అధీనమునందు ఉన్నది) కూడా వారి స్థాపనయే అని కర్ణప్రమాణం. ఈ నాడు సిద్ధాంతాలకతీతంగా షాణ్మతాలవారమూ మన ఇష్టదైవాన్ని మనస్ఫూర్తిగా స్మరించుకుంటున్నామంటేపూజిస్తున్నామంటేస్తుతిస్తున్నామంటేవేద ఘోష వినపడుతోందంటేమన ధర్మంలో చరిస్తున్నామంటే అది కేవల శంకరుల కఠోర శ్రమ ఫలితం తప్ప మరోటి కాదు. భిన్నత్వంలో ఏకత్వాన్ని చూపిఐకమత్యాన్ని నెలకొల్పిన మహానుభావుడు. 
          అటువంటి శంకరులకి కృతజ్ఞతాపూర్వక సాష్టాంగవందనాలు సమర్పిస్తూ ,
-శంకర కింకర...

          సర్వం శ్రీ గురుచరణారవిందార్పణమస్తు...

Friday, October 11, 2013

అజ్ఞాన పఞ్చకమ్ { మాయా పఞ్చకమ్}

శ్రీ గురుభ్యోనమః
నమస్తే

{ మాయా పఞ్చకమ్}

నిరుపమనిత్యనిరంశకేఽప్యఖణ్డే
            మయి చితి సర్వవికల్పనాదిశూన్యే
ఘటయతి జగదీశజీవభేదం
            త్వఘటితఘటనాపటీయసీమాయా
నిత్యుణ్ణి, నిరుపముణ్ణి, నిర్ అంశుణ్ణి అఖండుణ్ణి స్వయం జ్ఙానస్వరూపుణ్ణి ఐన నాయందు ఈ మాయ అజ్ఞానమును కలిగించి, జగత్తు, ఈశ్వరుడు, జీవుడు అను భేదాన్ని కలిగిస్తోంది. ఈ మాయ ఎన్నడూ ఘటించనిదాన్ని ఘటింపచేయడంలో ఎంత సామర్థ్యాన్ని ప్రదర్శిస్తోంది.?

శ్రుతిశతనిగమాన్తశోధకాన
            ప్యహహ ధనాదిదర్శనేన సద్యః
కలుషయతి చతుష్పదాద్యభిన్నాన్
            త్వఘటితఘటనాపటీయసీమాయా
వేదవాక్యములతోనూ, ఉపనిషద్ సూక్తులతోనూ ప్రభోధముచేసి చతుష్పాదులైన పశుపక్షాదులు జంతువులనుండి వేరుగా సంస్కరింపజేసినా కూడా ! ఆహా ఈ మాయ గొప్పదనమేమో..వారికి వెంటనే భోగింపదగు ధనమాదిగా సమస్త వస్తువులను చూపించి అవి పొందడం పోగొట్టుకోవడం అనే విషయములచే కలుషితులను కావిస్తోంది. ఈ మాయ ఎన్నడూ ఘటించనిదాన్ని ఘటింపచేయడంలో ఎంత సామర్థ్యాన్ని ప్రదర్శిస్తోంది.?

సుఖచిదఖణ్డవిబోధమద్వితీయం
            వియదనలాదివినిర్మితే నియోజ్య
భ్రమయతి భ్రమసాగరే నితాన్తం
            త్వఘటితఘటనాపటీయసీమాయా

అఖండ సచ్చిదానంద సుఖబోధస్వరూపమైన ఆత్మను ఈ మాయ ఆకాశాది పంచభూతనిర్మితమగు ఈ భవసాగరములో పడేసి, నిరంతరమూ కొట్టుకునేటట్టు చేస్తోంది.ఈ మాయ ఎన్నడూ ఘటించనిదాన్ని ఘటింపచేయడంలో ఎంత సామర్థ్యాన్ని ప్రదర్శిస్తోంది.?

అపగతగుణజాతివర్ణభేదే
            సుఖచితి విప్రవిదాద్యహఙ్కృతిం చ
స్ఫుటయతి సుతదారగేహమోహం
            త్వఘటితఘటనాపటీయసీమాయా
ఈ మాయ ఎంత గొప్పది, గుణ వర్ణ జాతి అనే భేద రహితుడైన, సుఖ చిత్ స్వరూపుడైన ఆత్మయందు బ్రాహ్మణాదిచాతుర్వర్ణాది రూపమగు అహంకారాన్ని, భార్య, భర్త, కొడుకు, ఇల్లు అనే మోహాలను కలిగిస్తోంది. ఈ మాయ ఎన్నడూ ఘటించనిదాన్ని ఘటింపచేయడంలో ఎంత సామర్థ్యాన్ని ప్రదర్శిస్తోంది.?

విధిహరహరివిభేదమప్యఖణ్డే
            బత విరచయ్య బుధానపి ప్రకామమ్
భ్రమయతి హరిహరభేదభావా
            త్వఘటితఘటనాపటీయసీమాయా
అఖండస్వరూపమైన బ్రహ్మంలో బ్రహ్మవిష్ణుశివ ఇత్యాది భేధములను నిర్మించి, బుధజన శ్రేష్ఠులు ఐన వారిని కూడా శివవిష్ణుభేదబుద్ధులుగా మార్చి ఆ భ్రమను కల్పిస్తూ ఈ మాయ ఎన్నడూ ఘటించనిదాన్ని ఘటింపచేయడంలో ఎంత సామర్థ్యాన్ని ప్రదర్శిస్తోంది కదా!

ఇతి శ్రీమచ్ఛంకరభగవత్పాద విరచిత మాయా పఞ్చకమ్




Wednesday, June 12, 2013

శ్రీ శంకరాచార్య కృత శ్రీ కనకధారా స్తవం-12

శ్రీ గురుభ్యోన్నమః
శ్లో11!! శ్రుత్యై నమో౭స్తు శుభకర్మ ఫల ప్రసూత్యై
రత్యై నమో౭స్తు రమణీయ గుణార్ణవాయై !
శక్త్యై నమో౭స్తు శతపత్ర నికేతనాయై
పుష్ట్యై నమో౭స్తు పురుషోత్తమ వల్లభాయై !!
తా : శుభములైన శ్రౌత, స్మార్త కర్మలకు సముచిత ఫలములనిచ్చువేదమాతృస్వరూపురాలైన లక్ష్మీదేవికి నమస్కారము. ఆనందపఱచు గుణములకు సముద్రము వంటి విశాఅమగు రతీదేవి స్వరూపురాలైన మాతకు ప్రణామము. నూఱు దళముల పద్మముపై ఆసీనురాలైన శక్తిస్వరూపురాలికి వందనము. విష్ణుమూర్తికి ప్రియురాలై పుష్టి నొసగు ఇందిరాదేవికి నమస్కారములు.

వివరణ: వేదరూపిణియై సకల శుభ ఫలములను ఇచ్చు వేదస్వరూపమైన తల్లికి నమస్కారము, వేదము సకల శుభ కర్మలకు శుభఫలములనిచ్చు స్వరూపము, శ్రౌత స్మార్త కర్మలను ఒనగూర్చువారికి సకల శుభ ఫలములనిచ్చునది. వేదము స్వరూపము ధర్మ స్వరూపమే కాబట్టి ధర్మవర్తనులకు శుభ కర్మ ఫలాలనిచ్చు శక్తికలైగిన శ్రుతి స్వరూపమైన తల్లికి నమస్కారము. నానా రత్నములను తన గర్భములో దాచుకొనిన విశాలమైన సముద్రవలె, రమణీయమైన గుణములకు సముద్రమువంటిదైన రతీదేవి (అనుభవపూర్వకమూ చేయు శక్తిగాఉన్నటువంటి తల్లి, మన్మథుడు= కోరిక; రతి=అనుభవములోనికి వచ్చుట) వంటి తల్లికి నమస్కారములు. నూరు దళములు కలిగిన పద్మములో నుండు అన్ని శక్తులకూ ఆధారభూతమైన శక్తికి నమస్కారము. పురుషోత్తముడైన శ్రీహరికి పుష్టిని స్ఫూర్తిని కలిగించు తల్లి శ్రీ లక్ష్మీ దేవికి నమస్కారము.
సందర్భం ప్రకారం: అమ్మా వేద స్వరూపమైన తల్లివి నీవే కదా, వేదము శుభ కర్మలకు శుభ ఫలములిచ్చును కదా, పైగా ఇంత దరిద్రములోనూ అధర్మ మార్గము పట్టక ఉంఛవృత్తితో జీవనము సాగిస్తూ స్వాధ్యాయం చేసుకుంటూ గడుపుతున్న కుటుంబం బ్రాహ్మణ కుటుంబం. వేదాన్ని, ధర్మాన్ని నమ్మి నలుగురికీ బోధ చేయవలసిన బ్రాహ్మణ కుటుంబానికే శుభ ఫలములతో ఐశ్వర్యమునివ్వకపోతే వేదాన్ని, ధర్మాన్ని పాటించే వారు కరవై ధర్మ లుప్తమౌతుంది తల్లీ. లోకంలో ధర్మానికి ఆపద వచ్చినప్పుడు ధర్మాన్ని కాపాడే వాడు పురుషోత్తముడైన శ్రీమహావిష్ణువు అటువంటి శ్రీ మహా విష్ణువుకే స్ఫూర్తిని పుష్టిని ఇచ్చేదానవు నీవు, నీవు వీరికి ఐశ్వర్యమునిచ్చి వేదాన్ని ధర్మాన్ని నమ్మినవారికి ఆపదలు, ఇక్కట్లు లేకుండా చేయవలసిన దానవు నువ్వేకదాతల్లీ. అమ్మా కేవల ధనవృద్ధితోనే ఐశ్వర్యవంతులు కాలేరు కదాతల్లీ, ధన ధాన్య వృద్ధి అనుభవైకవేద్యమవ్వాలి ( మన్మథుడు కోరికకు రూపమైతే ఆయన పత్ని తల్లి రతీదేవి కోరిక అనుభవములోకి వచ్చినప్పటి అనుభూతి) సముద్రము ఎంత విశాలమో, ఎన్ని రత్నాలను అందులో దాచుకున్నదో అంత గొప్ప అనుభవైకవేద్యమైన అనుభూతులను ఇవ్వగలిగిన తల్లివి నువ్వు. తల్లీ వీరికి ఐశ్వర్యమునిచ్చి, పాపములను తీసి ఐశ్వర్యమును అనుభవైకవేద్యముగ చేయగల తల్లివి. అమ్మా అన్ని శక్తులకు మూలమైన శక్తివి నువ్వు నీకు అనుగ్రహాన్ని కురిపించుట అతి తేలికైన పని అమ్మా అంత గొప్ప తల్లివైన నీకు పునః పునః పునః ప్రణామాలు.